మధ్యప్రదేశ్లోని శివ్పురి సంతలో మహిళలను అద్దెకిచ్చే దురాచారం కొనసాగుతుంది. ఏడాదికోసారి జరిగే ఈ మార్కెట్లో నచ్చిన అమ్మాయిని నెలలు, సంవత్సరాల చొప్పున అద్దెకు తీసుకుంటారు. వారికి రూ.15 వేలతో మొదలు రూ.లక్షల అద్దె చెల్లిస్తారు. ఈ రేటు కన్యలకు మరింత ఎక్కువగా ఉంటుంది. దీని కోసం వారు స్టాంప్ పేపర్పై అగ్రిమెంట్ చేసుకుంటారు. అద్దెకు వెళ్లాక, అక్కడేవైనా ఇబ్బందులుంటే ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసుకోవచ్చు.