మహారాష్ట్రలోని పూణెలో దారుణ సంఘటన జరిగింది. పూణెలోని ఎరవాడలో ఆర్ఎస్ కంపెనీకి చెందిన కొందరు యువకులు ఓ యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. యువకుడు వేరే ముఠాతో తిరుగుతుండడంతో వారంతా కలిసి దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎరవాడ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.