ఇటీవల కాలంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. కొందరు దొంగలు పట్టపగలే దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్నారు. తాజాగా ఓ దొంగ రైలులో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఓ యువతి మెడలో బంగారు గొలుసును చోరీ చేస్తుండగా పట్టుకున్న ఆ యువతి చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.