కేరళలో విషాద ఘటన జరిగింది. పెళ్లికి ఒక రోజు ముందు 18 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. మలప్పురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. షైమా సినివర్ అనే యువతి తన పొరుగింటిలో ఉండే 19 ఏళ్ల సజీర్తో ప్రేమలో ఉంది. అయితే, ఆమె కుటుంబం మాత్రం వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఇక రేపు పెళ్లికి అంతా సిద్ధమవుతుండగా, యువతి తన మామ ఇంట్లో ఉరేసుకుని మరణించింది. యువతి తండ్రి చనిపోయిన తర్వాత నుంచి మామ ఇంట్లోనే ఉంటోంది.