వైసీపీ అధినేత వైఎస్ జగన్కు హైకోర్టులో ఊరట లభించింది. పాస్పోర్టు రెన్యూవల్కు జగన్ వేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పాస్పోర్టు విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యూవల్ను ఐదేళ్ల పాటు పెంచుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది.