AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి పొదిలికి బయలుదేరుతారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. పొదిలి పొగాకు బోర్డును సందర్శించి.. రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి పయనమవుతారు.