మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3.45 గంటలకు ఆయన తాడేపల్లిలోని తన ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. రాత్రి 7.15 గంటలకు బెంగళూరులో ల్యాండ్ అవుతారు. ఈ మేరకు షెడ్యూల్ను జగన్ పీఏ పోలీసు శాఖకు అందించారు. ప్రొటోకాల్ ప్రకారం ఎస్కార్ట్, సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని కోరారు.