AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉ.10.30 గంటలకు గుంటూరు మిర్చి యార్డ్కు చేరుకుంటారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.