గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు విజయవాడలోని బందర్ రోడ్ లోని పాస్ పోర్టు ఆఫీసుకు వచ్చారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనతో పాటు సతీమణి భారతి ఉన్నారు. వీరిద్దరి పాస్ పోర్టులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉండటంతో వారిద్దరు అక్కడకు చేరుకున్నారు. పాస్ పోర్టు ఆఫీసులో దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉన్న వీరు.. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. జగన్ దంపతులురావటంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.