వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు సీఎం చంద్రబాబుని కలిశారు. వివేకా ఏపీ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్తో పాటు తమపై అక్రమ కేసు పెట్టారని సీఎం దృష్టికి తెచ్చారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని కోరారు. రాంసింగ్పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని కోరారు. సునీత విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.