పోరుమామిళ్ల పట్టణంలోని వైశ్య బజార్, ముస్లిం కోట వీధులలో శనివారం ఇంటింటికి తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేయాలని బద్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. డి విజయ జ్యోతి ప్రచారం నిర్వహించారు. బద్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే నాకు ఒక్క అవకాశం కల్పించమని, నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి కి ఓటు వేయాలని కోరారు.