జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు శుక్రవారం డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. మైలవరం పరివాహక ప్రాంతంలో తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు నీటిని వదులుతున్నట్లు డీ ఈ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం గండికోట ప్రాజెక్టులో 2. 498 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.