ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీల భర్తీకి ఈనెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కొండాపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డి. కృష్ణవేణమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27న పరీక్ష నిర్వహిస్తామని ఆమె తెలిపారు. విద్యార్థులు జిల్లాలోని ఏ స్కూల్ ను కోరుకుంటారో ఆ స్కూల్ కి వెళ్లి రిజిస్టర్ చేసుకుని ప్రవేశ పరీక్షకు 27న హాజరు కావాలని ఆమె తెలిపారు.