జమ్మలమడుగులో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది హాజరయ్యారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈవీఎంలతోపాటు ఎన్నికల సామాగ్రిని సరి చూసుకున్నారు. జిల్లాలోనే జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా 315 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి సుమారు2500మంది సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు హాజరై రూట్ మ్యాప్ లను సరిచూసుకున్నారు.