పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియతో బాటు ఏ విధమైన స్పష్టమైన జీఓలు లేకుండానే రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అందరిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని జిల్లా రెవిన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ను కలిసి ధర్నాకు సంబంధించిన నోటీసు అందజేశారు.