మైదుకూరు నియోజవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ని ఆదివారం కాజీపేట మండలం రావులపల్లి ఉప సర్పంచ్ దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి, నాగేశ్వర్, సుబ్బారెడ్డి, చిన్న, శ్రీనివాసులు, దుంపలగట్టు కిరణ్, చాట్ల సుబ్బరాయుడు లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ చరిత్రలో ఇంతటి ఘనవిజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి పదవి చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.