ఇంటింటికి రేషన్ పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పులివెందుల వైకాపా పట్టణ ఉపాధ్యక్షులు, నాలుగో వార్డ్ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేవారన్నారు. కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ బియ్యం ఇంటింటికి పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.