
భారత్ దాడులు ఆపితేనే మేమూ ఆపుతాం: పాక్
భారత్- పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడులను ఆపితేనే తామూ కూడా ప్రతిదాడులు ఆపేందుకు సిద్ధమని తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించాలంటే భారత్ ముందడుగు వేయాలని పేర్కొన్నారు. ఈ అంశాన్ని అమెరికా అధికారులకు కూడా స్పష్టం చేసినట్టు ఆయన వెల్లడించారు. అయితే భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న విషయం తెలిసిందే.