తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 46.25 శాతం బీసీలు (1.64 కోట్ల మంది) ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు కులగణన సర్వే వివరాలను సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎస్సీలు 61.84 లక్షలు (17.43%)గా ఉన్నారని పేర్కొన్నారు. ఎస్టీలు 37.05 లక్షలు (10.45%), ముస్లిం బీసీలు 35.76 లక్షలు (10.08%), ఓసీల జనాభా 41.21 లక్షలు (13.31%)గా ఉందని స్పష్టం చేశారు.