దిల్లీలోని సఫ్దర్గంజ్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు 100 అడుగుల ఎత్తైన భారీ మొబైల్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటలకు జరగడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణాపాయం తప్పింది. అలాగే ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని సంబంధిత అధికారులు తెలిపారు.