ఇంటికి కొత్తల్లుడు వస్తే రకరకాల వంటకాలను చేసి పెట్టే అత్తామామలను మనం చూస్తుంటాం. కానీ ఉగాది రోజు తొలిసారిగా ఇంటికొచ్చిన మునిమనుమడి కోసం ఓ తాత, అమ్మమ్మ 108 రకాల వంటకాలను చేసి పెట్టారు. ఏలూరు జిల్లా మర్లగూడెంకు చెందిన దుర్గారావు కుటుంబం పిండి వంటలు, వివిధ తినుబండారాలు, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, సీట్లు తదితర పదార్థాలను సిద్ధం చేసి మునిమనుమడికి తినిపించారు.