అత్యంత ప్రాణాంతకమైన “బ్రెయిన్ ఈటింగ్ అమీబా" నుంచి కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. మొత్తం 22 రోజుల చికిత్స తరువాత అతను ఈ వ్యాధిని జయించాడని ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఈ మేరకు ఆ బాలుడికి చికిత్స అందించిన వైద్యులకు మంత్రి వీణా జార్జ్ అభినందనలు తెలియయజేశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధి నుంచి కేవలం 11 మంది మాత్రమే బయటపడ్డారు.