రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా రూప్వాస్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మార్కెట్కు వెళ్తున్న బాలికను రోహిత్ అనే యువకుడు తన మిత్రులు రింకు, బబ్బల్, బబ్లుతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఆమెను గదికి తీసుకెళ్లి రోహిత్ అత్యాచారానికి పాల్పడ్డాడని, మిగిలిన ముగ్గురు బయట కాపలా కాశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.