TG: నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నవారికి ప్రభుత్వం షాక్ ఇస్తోంది. 2023 డిసెంబరు నుంచి 2025 జూన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ తెలిపింది. మద్యం తాగి లేదా డ్రగ్స్ తీసుకుని, అతి వేగంతో డ్రైవింగ్ చేయడం వంటి తీవ్ర ఉల్లంఘనలు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన ప్రగతి నివేదికలో పలు అంశాలను వెల్లడించింది.