సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. రెగ్యులర్ బస్సులకు ఇవి అదనమని, ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల్లేవనీ, రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.