కందిరీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు

52చూసినవారు
కందిరీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు
హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రక్కడ్ గ్రామంలో పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా గూగా ఆలయ సందర్శనకు వెళ్లిన కుటుంబంపై కందిరీగల దాడి జరిగింది. ఈ దాడిలో వరుడు నవీన్ సింగ్‌ సహా మొత్తం 25 మంది గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని నాడౌన్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా వివాహ వేడుకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్