హిమాచల్ ప్రదేశ్లో వెలుగుచూసిన రూ.2500 కోట్ల క్రిప్టోకరెన్సీ కుంభకోణంలో కీలక నిందితుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మిలన్ గార్గ్ (35) ఆచూకీని కోల్కతాలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకాక్కు పరారయ్యేందుకు యత్నిస్తుండగా కోల్కతా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ కుంభకోణం నవంబర్ 10, 2023న హిమాచల్ లో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది.