ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని కార్పొరేషన్ పరిధి షీట్లా ఆలయం సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ 12న షాకింగ్ ఘటన జరిగింది. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. ఆలయం సమీపంలో వాటర్ వర్క్స్ కోసం కార్పొరేషన్ సిబ్బంది తవ్విన గుంతలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. వెంటనే ఓ యువకుడు స్పందించి బాలుడిని కాపాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన కమిషనర్ గుంతలు పూడ్చని సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.