కేంద్ర ప్రభుత్వం 2029లో జరిగే జనరల్ ఎలక్షన్స్ నుంచి మహిళలకు అసెంబ్లీ, లోక్సభలో 33% రిజర్వేషన్ ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. 2023 సెప్టెంబరులో నారీ శక్తి వందన్ అభియాన్ (NSVA) బిల్లు చట్టసభల ఆమోదం పొందింది. ఇక వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జనాభా, కుల గణన నిర్వహించి, దానికనుగుణంగా కొత్త జాబితా సిద్ధం చేసి డీలిమిటేషన్, రిజర్వేషన్ విధానం అమలుపరచే అవకాశాలు ఉన్నాయి.