ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్పై చేపట్టిన దాడుల్లో 34 మందికి గాయాలైనట్లు సమాచారం. టెల్ అవీవ్లోని జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో బాలిస్టిక్ మిస్సైళ్ల దాడులు జరిగాయని తెలుస్తోంది. తొమ్మిది భవనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఇరాన్ సుమారు 100 మిస్సైళ్లను ప్రయోగించగా, వాటిలో ఎక్కువ భాగాన్ని ఛేదించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరువైపులా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.