10వ తరగతిలో అర్హతతో 39,481 ఉద్యోగాలు

81చూసినవారు
10వ తరగతిలో అర్హతతో 39,481 ఉద్యోగాలు
దేశ రక్షణ దళంలో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ నియామకాలు ప్రక్రియకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది(2025) జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది 39,481 పోస్టుల భర్తీ కానున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. https://ssc.gov.in/ ఈ లింక్‌పై క్లిక్ చేసి పూర్తి వివరాలు చూడగలరు.

సంబంధిత పోస్ట్