బిహార్లో ఇటీవల కల్తీసారా తాగి 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ మద్యం నిషేధం ప్రవేశపెట్టినప్పటి (2016) నుంచి కల్తీ సారా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. ఆ కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. అయితే ఆ కుటుంబాలు మద్య నిషేధానికి అనుకూలంగా ఉన్నట్లు లేఖను సమర్పించాలని తెలిపారు.