తెలంగాణకు 2024-25 వైద్యవిద్యాసంవత్సరంలో మరో 4 వైద్య కళాశాలలు రానున్నాయి. మొత్తం ఎనిమిది మెడికల్ కాలేజీలను రాష్ట్రం కోరగా నాలుగింటికి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపింది. ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట వైద్య కళాశాల్లో 50 సీట్ల చొప్పున MBBS క్లాసుల్ని ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది. యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్లో కాలేజీల ఏర్పాటు విజ్ఞప్తిని తిరస్కరించింది.