ప్రయాగ్రాజ్లోని త్రివేణీసంగమం వద్ద జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి 40 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల మంది భక్తులు విచ్చేయగా.. అత్యధికంగా మకర సంక్రాంతికి 3.5 కోట్లు, మౌనీ అమావాస్యకు 8 కోట్లు, వసంత పంచమి వేళ 2.57 కోట్లమంది అమృత స్నానాలు చేసినట్లు వివరించింది.