యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో గత 26 రోజులుగా జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుండడంతోముగుస్తుందడంతో అప్పటి వరకు పుణ్యస్నానం ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.