తెలంగాణలో రెండు నెలల్లో 4,294 డెంగీ కేసులు నమోదు

61చూసినవారు
తెలంగాణలో రెండు నెలల్లో 4,294 డెంగీ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ కేసులు భారీగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 5,372 మంది డెంగీ బారిన పడినట్టు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. రెండు నెలల్లో 4,294 కేసులు నమోదయ్యాయి. డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5% పాజిటివిటీ రేటు ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగీ నిర్ధారణ అవుతోంది.

సంబంధిత పోస్ట్