కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేగింది. జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని తెలుస్తోంది. 48 మంది అసభ్య వీడియోలు సీడీలు, పెన్ డ్రైవ్ లో ఉన్నాయని ఆ రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీలో వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని తెలిపారు. కాగా, ఈ కేసులో త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.