అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే ప్రక్రియ అమెరికా కొనసాగిస్తోంది. భారత్కు సైతం తొలివిడతగా 104 మందిని ప్రత్యేక విమానంలో పంపింది. ఈ నేపథ్యంలో అమెరికా బహిష్కరణ జాబితాలో ఎంతమంది భారతీయులన్నారనేది దానిపై భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్రీ శుక్రవారంనాడు స్పందించారు. అమెరికా బహిష్కరణ జాబితాలో 487 మంది ఉన్నారని తెలిపారు. ఆ వివరాలు తాము అడిగామని, 298 మందికి సంబంధించిన వివరాలు అందజేశారని చెప్పారు.