త్వరలోనే 5000 సర్వేయర్ల నియామకం: మంత్రి పొంగులేటి

62చూసినవారు
త్వరలోనే 5000 సర్వేయర్ల నియామకం: మంత్రి పొంగులేటి
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే 5000 సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సర్వే, సెటిల్‌మెంట్, ల్యాండ్ రికార్డ్స్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు సర్వేయర్ల నియామకం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అర్హుల నుంచి మే 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, భూభారతి చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్‌కు ల్యాండ్ సర్వే మ్యాప్ తప్పనిసరని వెల్లడించారు.