AP: పోక్సో కేసుల్లో 20 శాతం మంది నిందితులు 20 ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారని హోంమంత్రి అనిత సంచలన విషయాలు వెల్లడించారు. అందులో 18 ఏళ్లలోపు వాళ్లు 60 శాతం మంది ఉంటున్నారని చెప్పారు. ఇక ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని.. ఆవేశంలో చేసిన తప్పులకు జైలుపాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, యువత భవిష్యత్తును గంజాయి నాశనం చేస్తుందని, జీవితాలను ఇబ్బందుల పాలు చేసుకోవద్దని హోంమంత్రి హితవు పలికారు.