TG: ఈ ఏడాది యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఈ సీజన్ లో 72.42 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 12.65 లక్షల టన్నులు అధికమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 12.33 లక్షల మంది రైతుల నుంచి రూ.16,760 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.15,121 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. 'నాడు వరి వేస్తే ఉరి-నేడు వరి వేస్తే సిరి' ఆయన ట్వీట్ చేశారు.