హైదరాబాద్ లోని సనత్ నగర్ లో విషాదం నెలకొంది. GHMC స్విమ్మింగ్ పూల్లో పడి 12 ఏళ్ల బాలుడు కార్తికేయ మృతి చెందాడు. స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడింది. స్విమ్మింగ్ పూల్ బంద్ ఉండగా గోడ దూకి వెళ్లిన కార్తికేయ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో.. స్నేహితులు కార్తికేయ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి చూడగా స్విమ్మింగ్ పూల్లో కార్తికేయ విగతజీవిగా కనిపించాడు.