పోలీసుల ముందే బీజేపీ నేతపై కాల్పులు

69చూసినవారు
పోలీసుల ముందే బీజేపీ నేతపై కాల్పులు
మధ్యప్రదేశ్‌ నాగ్జిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున దారుణం జరిగింది. బీజేపీ యువ నేత ప్రకాష్ యాదవ్‌కు ఎస్పీ భదోరియాకు మధ్య వివాదాలున్నాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి భదోరియా పిస్టల్‌తో వచ్చాడు. పోలీసుల ముందే ప్రకాష్‌పై కాల్పులు జరిపి పరారయ్యాడు. ప్రస్తుతం ప్రకాష్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్