పహాల్గమ్ ఉగ్రదాడి భారత్-పాక్ దేశాల మధ్య యుద్దానికి తెరలేపింది.ఈ క్రమంలోనే భారత్లో చాలా చోట్ల పాక్ జెండాను రోడ్డుపై అంటించి నిరసనలు చేస్తున్నారు. కొందరు కుర్రాళ్లు HYD-దిల్సుఖ్నగర్లో రోడ్డుపై పాక్ జెండా అంటించారు. చాలామంది దానిని తొక్కుతూ వెళ్లిపోయారు. ఒక బుడ్డాడు మాత్రం ఆ జెండా చూడగానే కోపంతో రగిలిపోయాడు. కాళ్లతో ఎగిరెగిరి తొక్కాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ 'శభాష్ బుద్దోడా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.