డ్రైవర్ తప్పిదంతో కారు అదుపుతప్పి విశ్వేశ్వరయ్య కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండ్య తాలూకా అవ్వేరహళ్లి వద్ద జరిగింది. మృతుడు పాండవపుర తాలూకా బ్యాడరహళ్లి గ్రామనికి చెందిన నందీశ్ (18)గా గుర్తించారు. మరో వ్యక్తి యోగానందకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కాలువలోకి దిగి కారులో ఇరుక్కున వారిని బయటకు తీశారు.