TG: రాష్ట్రంలో ఎరుకల సామజికవర్గానికి కేసీఆర్ ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టారని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని తుంగలో తొక్కారని తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఆదివారం ట్యాంక్బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఎరుకల రాజకీయ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రూ.500 కోట్లతో తక్షణమే ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.