ఉత్తర్ప్రదేశ్లోని బరాదరిలో నివసించే ఓ మహిళ తన కుమార్తెపై అత్యాచారం జరిగిందంటూ 2019 డిసెంబరు 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజయ్ తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక తొలుత వాంగ్మూలం ఇచ్చింది. నిందితుడు నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడు. ఈ కేసు విచారణ సందర్భంగా బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది. తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లికి 1,653 రోజులు జైలు శిక్షతో పాటు రూ.5,88,822 జరిమానా విధించారు.