బైక్ పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ ఓ యువ సైంటిస్ట్ ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్కు చెందిన డాక్టర్ అభిషేక్ (39) పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని IISER లో ప్రాజెక్ట్ సైంటిస్ట్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద బైక్ పార్కింగ్ విషయంలో పక్కింటి వ్యక్తి మాంటీతో గొడవ జరిగింది. దీంతో మాంటీ అభిషేక్ను దారుణంగా కొట్టడంతో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.