ఛత్తీస్గఢ్లోని మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్పై న్యాయవిచారణ జరపాలని CPI డిమాండ్ చేస్తోంది. న్యాయవిచారణ కోరుతూ ఆ పార్టీప్రధాన కార్యదర్శి డి.రాజా అమిత్ షాకు ట్వీట్ చేశారు. మావోయిస్టులను అరెస్టు చేయకుండా హత్య చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. మావోయిస్టులు, ఆదివాసీల హత్యను CPI తీవ్రంగా ఖండిస్తోందని రాజా తెలిపారు.