AP: చదువుల ఒత్తిడి భరించలేక ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వీర రోహిత్(21) అనంతపురం మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. డిసెంబరులో పరీక్షల నేపథ్యంలో కాలేజీ హాస్టల్లోని గదిలో ఒక్కడే ఉంటున్నాడు. బుధవారం 'పరీక్షల ఒత్తిడిని భరించలేకున్నా.. ఏకాగ్రత చేయలేకపోతున్నా.. తన చావుకు తానే కారణమని' అని లేఖ రాసి విద్యార్థి హాస్టల్ గదిలో ఉరిబిగించుకున్నాడు.